
ఘనంగా కూడా చైర్మన్గా తలాటం సత్య ప్రమాణ స్వీకారం
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్గా తలాటం సత్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి – సంక్షేమం ప్రభుత్వ ప్రధాన అజెండా
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని అన్నారు. తలాటం సత్య నాయకత్వంలో కూడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శిస్తూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నామని చెప్పారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో సమర్థ పాలన
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం నాయకులు తలాటం సత్యను అభినందించి, ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.