టిడిపి రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి స్థానం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి కీలక అవకాశం లభించింది. ఆమెను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ప్రభుత్వ పదవులు ఆశిస్తున్న ఆమెకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించడం ఊరటగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థాగత బాధ్యతల్లో ఆమెకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ బీసీ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు భావిస్తున్నారు.

ఈ నియామకం ఆమె రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశగా మారనుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.