తిరువూరు జనసేన పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో తిరువూరు జనసేన పార్టీ పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను హాజరై మనునోలు శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. పార్టీ అభివృద్ధికి మనునోలు శ్రీనివాస్ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా, నగర స్థాయి నాయకులు పాల్గొని మనునోలు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.