నాదెండ్ల భాస్కరరావుకి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్

హైదరబాద్: జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ మరియు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావుక చిత్రపటానికి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల భాస్కర్ సేవలను స్మరించుకుంటూ గౌరవాంజలి అర్పించారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాదెండ్ల భాస్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారికి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం నివాళులర్పించారు. గత నెల 22 వ తేదీన శ్రీ భాస్కరరావు గారి మృతి వార్త తెలుసుకొన్న వెంటనే శ్రీ భాస్కరరావు గారి కుమారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. అప్పట్లో సైనస్ సమస్య వల్ల శాస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా నివాళులర్పించినందుకు రావడానికి వీలు పడలేదు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు
హైదరాబాద్‌లో భాస్కరరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నమస్కరించారు.
అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, కుటుంబ సభ్యులకు పరామర్శించి, ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.