



ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలకు వినూత్న పరిష్కారంగా ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు తీసుకొచ్చిన “మ్యాజిక్ డ్రెయిన్స్” ప్రాజెక్ట్పై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి P. V. Sindhu ప్రశంసలు కురిపించారు.
గ్రామాల్లో మురుగునీటి నిల్వ, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు వంటి కీలక సమస్యలకు ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని ఇంకుడు గుంతల ద్వారా వేగంగా గ్రౌండ్లోకి పంపించడం, మూడు స్థాయిల ఫిల్టర్ వ్యవస్థ ద్వారా నీటిని శుద్ధి చేసి భూగర్భ జలంగా మారుస్తుంది.
సాధారణ సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే ఈ విధానం ద్వారా 80% వరకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పాలనా వ్యవహారాల్లో కొత్త అయినప్పటికీ, Pawan Kalyan గారు ప్రజా సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందిస్తున్నారని P. V. Sindhu అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రధానమంత్రి Narendra Modi గారి సహకారం, ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారి నాయకత్వంలో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.