యు.కొత్తపల్లిలో అన్న క్యాంటీన్ ప్రారంభం – పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది

వారికీ కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయం

పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు

పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి వారి కళ్లలో సంతోషాన్ని నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలిలో ప్రభుత్వ విప్, జనసేన పార్టీ అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరి ప్రసాద్ గారు అన్నారు. పదిమందికి పట్టెడు అన్నం పెట్టి ఆనందపడే సంస్కృతి మనది అని, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ గారు ఎందరో అన్నార్తుల కడుపు నింపారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప మాతృమూర్తుల స్ఫూర్తితోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండో విడతగా రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేసిన 62 క్యాంటీన్లలో పిఠాపురం లోని ఉప్పాడ కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను శ్రీ హరి ప్రసాద్ గారు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ” యూ. కొత్తపల్లి ప్రాంతంలో మొదట అన్న క్యాంటీన్ ప్రతిపాదన లేకపోయినప్పటికీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయించారని వెల్లడించారు. ఫార్మా కంపెనీలో ఉద్యోగులు, విద్యార్థులకు, అలాగే మత్స్యకారులకు ఈ అన్న క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల మందికి భోజనం అందుతోంది. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మొదలుపెట్టిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం చక్కగా అమలవుతోంది. ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతోంది. కూటమి ప్రభుత్వంలో పేదలకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యం దక్కుతుంది అని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీ రాజశేఖర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాస్(కేకే) గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు గారు, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి శ్రీ వర్మ గారు, జనసేన ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదెల కిషోర్ గారు, కూటమి నాయకులు
పాల్గొన్నారు.

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాదని, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి వారి కళ్లలో సంతోషం నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదిమందికి పట్టెడు అన్నం పెట్టి ఆనందపడే సంస్కృతి మనదని, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ గారు ఎన్నో మంది అన్నార్తుల కడుపు నింపారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప మాతృమూర్తుల స్ఫూర్తితోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతగా ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లలో భాగంగా పిఠాపురం ప్రాంతంలోని ఉప్పాడ కొత్తపల్లిలో ఈ క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. యు.కొత్తపల్లి ప్రాంతంలో మొదట అన్న క్యాంటీన్ ప్రతిపాదన లేకపోయినప్పటికీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయించారని వెల్లడించారు.

ఫార్మా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, మత్స్యకారులకు ఈ అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు సుమారు 2 లక్షల మందికి భోజనం అందుతున్నట్లు చెప్పారు.

అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీ రాజశేఖర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాస్ (కేకే), మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ వర్మ, జనసేన ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదెల కిషోర్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.