దేశవ్యాప్తంగా జనసేన విస్తరించాలని పాదాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వీర మహిళ శ్రావణి సాయి

ప్రత్తిపాడు : జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా జనసేన వీర మహిళ శ్రావణి సాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రసిద్ధ పాదాలమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం ఆమె భక్తిశ్రద్ధలతో పసుపు, కుంకుమ, చీర, గాజులను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అభివృద్ధి, దేశవ్యాప్త విస్తరణ కోసం అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా శ్రావణి సాయి మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు దేశంలోని ప్రతి మూలకు చేరాలని ఆకాంక్షించారు. ఆయన నిస్వార్థ సేవ, ప్రజా సమస్యలపై పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యువతలో ఈ చైతన్యం వ్యాపించి జనసేన పార్టీ బలోపేతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు.

పాదాలమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసాన్ని పొందారని, అమ్మవారి ఆశీస్సులతో జనసేన పార్టీ జాతీయ స్థాయిలో మరింత ఎదుగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. దేశ సమగ్రత, యువత అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

శ్రావణి సాయి చేపట్టిన ఈ కార్యక్రమం స్థానిక జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.