
అమలాపురంలోని కల్వకొలను వీధి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3,5 వార్డుల మాజీ కౌన్సిలర్లు ఏడిద శ్రీను, బొర్రా వెంకటేశ్వరరావులకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ప్రజలు వీరిని అభినందిస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డులను మరింత అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కల్వకొలను బాబు, కల్వకొలను తాతాజీ, మధు, బెజవాడ సత్తిబాబు, ఆర్ఎస్, జి. శివ, ఏ. రవి, వై. లక్ష్మణరావు, కన్నబాబు, ఎస్వీఆర్ కామేశ్వరరావు మాస్టర్, గోకరకొండ సూరిబాబు, బోనం అప్పారావు, ఎమ్. సత్తిబాబు, గొర్తి అనురాధ, దువ్వూరి రాంబాబు, శ్రీపాద సోమన్న, నల్లా నాయుడు, ఎస్వి నాయుడు, గుద్దటి రమణ, మేడేపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు.