

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లాలో ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పాలన కొనసాగుతోందని పేర్కొంటూ జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రోడ్లు – భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలాగే టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు పుల్లి నరేందర్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సభలో పాల్గొని ప్రసంగించారు.
జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్, తంబళ్లపల్లె నాయకుడు పోతుల సాయినాథ్తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని, అభివృద్ధి కార్యక్రమాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రానికి లభిస్తున్న జాతీయ స్థాయి గుర్తింపులు అభివృద్ధికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లుగా నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో పాలన కొనసాగుతోందని పేర్కొంటూ జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత సభలో పాల్గొన్నారు.
సభలో పాల్గొన్న పలువురు నాయకులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సభను విజయవంతం చేశారు.