



వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడుగారి నేతృత్వంలో ముఖ్యమైన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. వివిధ శాఖల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమగ్రంగా సమీక్ష జరిగింది.
రాష్ట్రంలో పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.