
నందివాడ మండలం పుట్టగుంట గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ₹104.12 కోట్లతో బుడమేరు పై ఆధునిక వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
వరద ముంపు సమయంలో సమస్యలను స్వయంగా పరిశీలించిన నాయకత్వం, శాశ్వత పరిష్కారానికి ముందడుగు వేసింది.
ఈ వంతెనను NH-216H పై 2 లేన్లు + పేవ్డ్ షోల్డర్లతో నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో కూడా నిరంతర రాకపోకలు కొనసాగేందుకు ఇది సహాయపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జిల్లాకు ఆల్-వెదర్ కనెక్టివిటీ, మెరుగైన ట్రాఫిక్ సౌకర్యం లభించనుంది.