


నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణంలోని భాష్యం స్కూల్ నూతన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్య ద్వారానే విద్యార్థులు తమ భవిష్యత్తును బలంగా నిర్మించుకోగలరని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో పాఠశాలలు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు.
భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో భాష్యం విద్యాసంస్థలు ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసంపై కూడా దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.