
రాజంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలానికి చెందిన జనసేన నాయకుడు గుగ్గిళ్ల నాగార్జున తన దరఖాస్తును రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీకి సమర్పించారు.
పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని గుర్తించడం, భవిష్యత్ బాధ్యతల కేటాయింపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.