
అమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రైతు సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాలు, రాయితీలు అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో అందేలా చూడాలని సూచించారు.
రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జయ వెంకటలక్ష్మి, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.