పాల వెల్లువ పథకంలో అవినీతి ముమ్మాటికి వాస్తవం

• లక్షల పాడి పశువులు ఎక్కడ ఉన్నాయో చూపించండి
• అన్ని లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఆ స్థాయిలో లేదు కదా?
• సమాధానం చెప్పలేకే మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు
• మంత్రిగారికి శాఖపై పట్టు లేదు… ఎస్.ఎల్.బి.సి.ని వేదిక చూసే తీరిక లేదు
• ఎస్.ఎల్.బి.సి. సమావేశం జరిగిన సంగతైనా తెలుసా?
• త్వరలోనే మంత్రిగారి అంబులెన్స్ కుంభకోణం ఆధారాలతో బయటపెడతాం
• దమ్ముంటే పాల వెల్లువ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల చేయండి
• క్షేత్ర స్థాయి పర్యటనలో నిజానిజాల నిగ్గుతేల్చుదాం రండి
• నవంబర్ 14 నుంచి రోజుకో స్కాంపై పత్రికా సమావేశం
• తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

“జగనన్న పాలవెల్లువ పథకంలో రూ.2887 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా జనసేన పార్టీ బయటపెడితే… దీనిపై స్పందించాల్సి న మంత్రిగారు వ్యక్తి గత విమర్శలతో సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేశార”ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. పాడిపరిశ్రమ, పశువర్ధక శాఖలో జరిగిన అవినీతిపై తాము ప్రశ్నించిన పది రోజుల తరువాత స్పందించిన మంత్రిగారు నోటికొచ్చినట్లు మాట్లాడి అవినీతిపై మాట దాటేశారని అన్నారు. ఆయన శాఖలో అవినీతే జరగకపోతే పథకంలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలి. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు కావాలని పథకాల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ప్రశ్నిస్తుంటే… బాధ్యతా యుతంగా సమాధానం చెప్పాల్సిన సంబంధిత మంత్రి మాత్రం వ్యక్తి గత విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడిగిన ప్రశ్నలు మూడే మూడే.

  • పాడిపశువుల కొనుగోలుపై ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడాలు ఎందుకు ఉన్నాయి?
  • మీరు చెప్పినట్లే 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు?
  • అవినీతి జరగకపోతే లబ్ధిదారుల జాబితాను ఎందుకు బయటపెట్టడం లేదు?
    ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని సంబంధిత మంత్రిని డిమాండ్ చేస్తే ఆయన… రాష్ట్రం లో ఉన్న డెయిరీల పరిస్థితి గురించీ… చిత్తూరు డెయిరీ , సంఘం డెయిరీలో ఏం జరిగింది? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? వ్యక్తి గత విమర్శలు, రాజకీయ అంశాలు మాట్లాడి సమస్యను పక్క దారి పట్టించాలని చూశారు.

• చేయూత పథకం… పేద మహిళల కోసమా? అమూల్ కోసమా?
నిజానికి పథకంలో అవినీతి జరగకపోతే… అసెంబ్లీలో గణాంకాలకు వివరణ ఇవ్వాలి. ఒక మంత్రి 2,08,790 పాడిపశువులు కొనుగోలు చేశామని చెప్పారు. మరుసటి రోజే మరో మంత్రి 3.94 లక్షల పశువులు కొనుగోలు చేశామని చెప్పారు. ఇంకో సందర్భంలో ఇదే మంత్రి గారు 3,92,911 పాడిపశువులు కొనుగోలు చేశామని చెప్పా రు. ఇందులో ఏది నిజం? ని జాని కి 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసుంటే మహిళల మినీ డెయిరీల ద్వారా రూ. 14,250 కోట్ల ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వృద్ధి జరిగేవి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 22 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది . రోజూ 2.72 లక్షల లీటర్ల పాలు అమూల్ కోసం సేకరిస్తున్నామని మంత్రి గారు గర్వంగా చెబుతున్నారు. చేయూత పథకం మహిళల ఆర్థిక వృద్ధి కోసం పెట్టారా? లేక అమూల్ డెయిరీ కోసం పెట్టారా? అనేది మంత్రిగారు సమాధానం చెప్పాలి. లబ్ధిదారులు అమూల్కు సహకరించకపోతే సంక్షేమ పథకం నుంచి తప్పిస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదేం పథకం.

• పాపం… మంత్రి గారికి తీరిక లేదేమో?
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ (ఎస్.ఎల్.బి.సి.) జరగలేదని మంత్రిగారు చెబుతున్నారు. పాపం… ఆయనకు సమాచారం లేకపోయి ఉండొచ్చు . లేకపోతే తీరిక లేక పట్టించుకొని ఉండరు. అక్టోబర్ 30వ తేదీన ఈ కాన్ఫరెన్స్ జరిగింది . తొమ్మిది పేజీల నివేదిక అధికారులు సమర్పించారు. అందులో మూడో పేజీలో కొనుగోలు చేసిన పాడి పశువులనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపించారని , నిజమైన లబ్ధిదారులకు కాకుండా వైసీపీ సానుభూతిపరులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారు… అందుకే కొన్ని కమర్షియల్ బ్యాంకులు సహకరించడం లేదని అధికారులు నివేదిక ఇచ్చారు. ముందు ఆ నివేదిక తెప్పించుకొని మూడో పేజీ ఒక్కసారి చదవండి. మాట్లాడితే క్లాస్వార్ అని ముఖ్య మంత్రి మాట్లాడతారు. మహిళ సాధికారిత, ఆర్థిక వృద్ధి అంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం దాదాపు 5 లక్షల మంది ఆడబిడ్డల ఆర్ధిక వృద్ధిని దెబ్బతీశారు. దీని పై ముఖ్య మంత్రి, మంత్రి సమాధానం చెప్పాలి.
• రోజుకో అవినీతిని ఎండగడతాం
నవంబర్ 14వ తేదీ నుం చి రోజుకో ప్రెస్ కా న్ఫరెన్స్ ని ర్వహిం చి వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజాక్షేత్రం లోనే ఎండగడతాం . ముఖ్యం గా పశువర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రిగారి అంబులెన్స్ స్కాంను ఆధారాలతో బయటపెడతాం . అధికా రులతో కలిసి చేశారా? లేకపోతే ఆయన ఒక్క రే చేశారా? లెక్క లతో సహా తేలుస్తాం . పాడి పశువుల కొను గోలులో భారీ గా అవినీతి జరిగిన మాట ముమ్మా టికి వాస్తవం. 3.94 లక్షల పశువులు కొను గోలు చేసినట్ లు మంత్రి చెప్పా రు. క్షేత్ర స్థా యి అధికా రుల పరిశీలనలో మాత్రం 8 వేలు మాత్రమే కొను గోలు చేసినట్ లు తేలింది . ఈ పథకంలో దాదాపు రూ.2887 కోట్ల అవినీతి జరిగింది . రూ.738 కోట్ల సబ్సి డిని దారి మళ్లిం చారు. లబ్ ధిదారుల జాబితా విడుదల చేసి మీరు సిద్ధం అంటే మేము కూడా క్షేత్ర స్థా యి పర్య టనకు సిద్ధం గా ఉన్నాం . వాస్తవాలను క్షేత్రస్థా యిలోకి వెళ్లి ప్రజలకు తెలియజేస్తాం . వైసీపీ ప్రభుత్వం సిద్ధం గా ఉంటే ముం దుకు రావాల”ని సవాల్ చేశారు. ఈ కా ర్య క్రమంలో గుం టూరు జిల్లా అధ్య క్షులు శ్రీ గాదె వెం కటేశ్వరరావు, రాష్ట్ర కా ర్య దర్శి శ్రీ ఆమంచి శ్రీని వాస్, సంయుక్త కా ర్య దర్శి శ్రీ బండారు రవికాం త్, పార్టీ నేతలు శ్రీ పసుపులేటి మురళీ కృష్ణ, శ్రీ హరిదాసు గౌరీ శంకర్, శ్రీ షేక్ జాకీర్ హుస్సే న్ తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.