నేటి నుంచి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు

పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ విడుదల చేసిన జనసేన పార్టీ
సమన్వయ సమావేశాల్లో రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల ప్రధాన పాత్ర
జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్య క్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, జనసేన-టిడిపి సమన్వయ సమావేశాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఒక్కో నియోజకవర్గారా్నికి ఒక్కొక్కరిని పార్టీ అధిష్టానం నియమించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసేందుకు మాత్రమే వీరిని నియమించారన్నారు. ఈ సమావేశాల్లో ఎక్కడా ప్రోటోకాల్కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలతో పాటు మండల కమిటీల్లోలోలూని కార్య వర్గాలకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రోటోకాల్ను విస్మరించవద్దని సూచించారు. అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పార్టీ సమన్వయ పరిచేందుకు మాత్రమే నియమించారని ఆయన స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.