
అమలాపురం: అల్లవరం మండలం బోడసకుర్రు శివారు దేవర్లంకలో శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహోత్సవం మే 10వ తేదీ ఆదివారం నుంచి మే 11వ తేదీ సోమవారం వరకు రెండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ సోమవారం ఉదయం 10:29 గంటలకు అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 11:30 గంటలకు అఖండ అన్నసమారాధన నిర్వహించబడుతుంది.
ఈ పుణ్యకార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఈ వేడుకలు భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.