మామిడికుదురు అగ్నిప్రమాద బాధితులకు నూతన షెడ్లు ప్రారంభం

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం నిర్మించిన నూతన షెడ్లను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. రూ.5.50 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్లను బాధిత కుటుంబాలకు అప్పగించారు. అలాగే మానవతా మూర్తులు సంస్థ, పాలకొల్లు వాకర్స్ అసోసియేషన్ అందించిన నివాస సామాగ్రిని పంపిణీ చేశారు. త్వరలో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

రాజోలు: మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇళ్ల స్థానంలో 5.50 లక్షల రూపాయలతో నూతన షెడ్ల నిర్మాణం చేపట్టారు. గురువారం శాసన సభ్యులు నూతనంగా నిర్మించిన షెడ్లను ప్రారంభించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు.

అదే విధంగా, మానవతా మూర్తులు సంస్థ మరియు పాలకొల్లు వాకర్స్ అసోసియేషన్ సమకూర్చిన నివాస సామాగ్రిని ఆ కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు అన్ని కుటుంబాలకు కరెంట్ మీటర్లను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, త్వరలో నష్టపోయిన కుటుంబాలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం ద్వారా గృహాలు నిర్మించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.