వీరనారి ఝాన్సీలక్ష్మి బాయి పోరాటస్పూర్తి మహిళాలోకానికి ఆదర్శం

అసమాన ధీశాలి , అపూర్వ యుద్ద నిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు.. స్వాతంత్ర సేనాని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 195వ జయంతి ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్ డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం జనసేన పార్టీ ఝాన్సీ వీర మహిళా విభాగం వీరమహిళలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి వేడుకల్లో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఏసీ కమిటీ సభ్యురాలు విజయనగరం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి మరియు పీఏసీ సభ్యురాలు (మాజీ మంత్రి) శ్రీమతి పడాల అరుణ, నెల్లిమర్ల జనసేన – టీడీపీ సమన్వయకర్త శ్రీమతి లోకం మాధవి రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని మరియు పలువురు జనసేన పార్టీ మహిళ మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి , రౌతు కృష్ణవేణి , జనసేన పార్టీ మహిళా కార్పోరేట్ అభ్యర్థులు మాతగాయత్రి, పుష్పఎస్ కోట వీరమహిళ విభాగం నాయుకులు ఎర్ర వెంకటలక్ష్మి, విజయనగరం జిల్లా వీరమహిళలు వరలక్ష్మి, దుర్గ, జ్యోతి, పద్మ , అలేక్య , అట్టడ ప్రమీల, బాసి దుర్గ, కర్రి సరిత, హైమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.