ప్రజా స్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం

కళ్యాణదుర్గం నియోజకవర్గం : రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం అనే సభలో వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై చేసిన దాడికి వ్యతిరేకంగా ఏ.పి .యు.డబల్ యు.జె కళ్యాణదుర్గం శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు, న్యూస్ రిపోర్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మీడియా వారి పై జరిగిన ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ , ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో కలిసి జనసేన నాయకులు డివిజన్ ఆర్టీవో మరియు పట్టణ సీఐ గారికి మెమోరాండం ఇచ్చారు. భవిష్యత్తులో మీడియా వారి పై ఇలాంటి దాడులు మళ్లీపు నరావృతం అయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శు లు నరసయ్య, జనసేన జిల్లా జాయిం ట్ సెక్రెటరీ మరి యు (జె ఎస్పీ -టీడీపీ పాయిం ట్ ఆఫ్ కాంటా క్ట్ పర్స న్) బాల్యం రాజేష్, కళ్యా ణదుర్గం నియోజకవర్గం జనసేన వీరమహిళ షేక్ తార, కళ్యా ణదుర్గం జనసేన పట్టణ ఉపాధ్యక్షులు వంశీ, కళ్యా ణదుర్గం రూరల్ జనసేన మండల అధ్యక్షులు జాకీర్, శెట్టూ రు జనసేన మండల అధ్యక్షులు కాంత్ రాజు, కళ్యా ణదుర్గం జనసేన పట్టణ నాయకులు కార్తీక్, అనిల్, రహుల్ల జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.