
అమరావతి రాజధాని అంశంపై తన అంకితభావాన్ని మరోసారి నిరూపించిన నాయకుడు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే దిశగా ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది.
అమరావతి రాజధానిగా ప్రకటించిన నాటి నుండి రైతుల పక్షాన నిలబడి, వారి ఆకాంక్షలను గౌరవిస్తూ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గళమెత్తిన ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతూ, ఆంక్షలు, అడ్డంకులు ఉన్నా వెనుకడుగు వేయలేదు.
రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని నమ్ముతూ, అమరావతి పరిరక్షణ కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి, ఎన్నికల సమయంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టే దిశగా తన వంతు కృషి చేసి, నేడు పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా మారింది.
అమరావతి రైతుల త్యాగం, వారి ఆశయాలను గౌరవిస్తూ, అభివృద్ధి, ప్రగతి, భవిష్యత్ తరాల కోసం అమరావతిని ప్రజల రాజధానిగా తీర్చిదిద్దాలని జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఈ సందర్భంగా అమరావతి కోసం పవన్ కళ్యాణ్ గారి పోరాటాన్ని మరోసారి స్మరించుకోవాల్సిన సమయం ఇది.