విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రి లోకేశ్

విశాఖపట్నంలో ఘూగ్లె ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ నగరానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్తో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కీలక కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేశ్ కలిసి విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలో ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం నగరంలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించనున్న ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో కూడా మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేశ్ విశాఖలో పర్యటించడం ఇది రెండో రోజు కావడం గమనార్హం.

గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రాకతో విశాఖపట్నం ఐటీ రంగంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుని, రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.