

మాజీ కేంద్ర మంత్రి శ్రీ కావూరి సాంబశివరావు గారు కన్నుమూశారని తెలిసి చింతించానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయిదుసార్లు లోక్ సభకు ఎన్నికైన శ్రీ సాంబశివరావు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన మనవడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.