“విలువలే జనసేన ఊపిరి – నిజాయితీ గల జనసైనికులే పార్టీకి ఇంధనం”

విశాఖపట్నంలో జరిగిన జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పీఏసీ ఛైర్మన్ మరియు రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చేసిన ప్రధాన వ్యాఖ్యలు:

???? పార్టీ విలువలు & కార్యకర్తల ప్రాధాన్యం

  • నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనం.
  • పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.
  • పదవులు ఒక్క రోజులో రావు, కానీ ప్రతి ఒక్కరి కష్టానికి సరైన గుర్తింపు వస్తుంది.
  • బలహీన వర్గాలు, మహిళలు, చేనేతలు, మత్స్యకారులు – ప్రతి వర్గం సమస్యలపై జనసేనే ముందుంటుంది.

???? సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠినంగా

  • సోషల్ మీడియాలో జరుగుతున్న కుట్రలు, ముఖ్యంగా మహిళలపై దాడులను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.
  • దీనిని అరికట్టేందుకు చట్ట సభల్లో బలమైన స్వరం వినిపిస్తుంది.
  • పార్టీ నాయకులు ప్రతిరోజూ సమకాలీన అంశాలపై మాట్లాడాలి.

???? స్టీల్ ప్లాంట్ – ఆంధ్రుల హక్కు

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదటగా పోరాడింది జనసేన పార్టీనే.
  • పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలసి ఆంధ్రుల గౌరవం కాపాడారు.
  • ఇప్పటికీ జనసేన కూటమి ప్రభుత్వం బలంగా పోరాడుతోంది.

???? సుగాలి ప్రీతి కేసు – న్యాయం కోసం పోరాటం

  • గిరిజన బాలిక సుగాలి ప్రీతి అన్యాయంపై నిజాయితీగా పోరాడింది జనసేన మాత్రమే.
  • పవన్ కళ్యాణ్ కర్నూలులో 2 లక్షల మందితో కవాతు నిర్వహించారు.
  • బాధిత కుటుంబానికి సాయం, భూములు, ఉద్యోగం – ఇవన్నీ ఆయన ఒత్తిడితో సాధ్యమయ్యాయి.
  • కేసులో న్యాయం జరగాల్సిందే అన్నది జనసేన పార్టీ విధానం.

???? కూటమి స్ఫూర్తి

  • జనసైనికులు, వీర మహిళలు కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
  • రాష్ట్ర అభివృద్ధి కోసం అలయెన్స్ బలపడి ముందుకు సాగాలి.

???? రెండు తీర్మానాలు ఆమోదం

  1. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులకు ధన్యవాదాలు.
  2. పార్టీ సంస్థాగత నిర్మాణం, సంస్కరణలపై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు ఆమోదం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.