![](http://kingofandhra.com/wp-content/uploads/2023/12/image-36.png)
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా , రాజాం నియోజకవర్గం బుచ్చం పేట విద్యుత్ దీపాల కోసం రాజాం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ని కలిసిన జనసేన నాయకులు. జి.సి.ఎస్.ఆర్ కాలేజ్ నుండి బుచ్చం పేట గ్రామం వరకు వీధి దీపాల కోసం రాజాం పట్టణ కమిషనర్కి రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఎన్ని రాజు వినతిపత్రం అందజేయడం జరిగింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తా మని సానుకూలంగా స్పందించిన కమిషనర్. బుచ్చం పేట గ్రామం తరపున ఎన్ని రాజుకి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజు, బుచ్చం పేట జనసేన పార్టీ నాయకులు నమ్మి దుర్ గారావు పాల్గొనడం జరిగింది.