విశాఖలో మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ గారి హాజరు ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.