

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి నేను పాల్గొన్నాను.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వకారణంగా భావిస్తున్నాను.