
ఏలూరు: ధర్మభేరి ప్రాంగణంలో (జూట్ మిల్ పక్కన) ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. జనసేన నాయకుడు నారా శేషు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
నారా శేషు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా మెగా కుటుంబం చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని తాను కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎన్ ఫౌండేషన్ సభ్యులు నారా వెంకట హనుమకుమార్, చోడాబత్తుల సూరి బాబు పాల్గొన్నారు. అదనంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, భీమవరపు సురేష్, కొయ్య సత్తిబాబు, ఈదుపల్లి కాశీ పవన్, లక్ష్మీ సాగర్, తోట శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, కిరణ్, పిల్లా తాతారావు, మేడిచర్ల శ్యామ్, బండి రెడ్డి వాసు, పత్తేబాధ గోపి, దక్షిణపు వీధి పండు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమం ద్వారా స్థానికులు, ప్రజలకు సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తు చేయడం జరిగింది.