
ఒంగోలు: జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై పి జి ఆర్ ఎస్, రెవెన్యూ క్లినిక్లలో వచ్చే అర్జీల పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, 22ఏ కేసులు, జీరో ఖాతాలు, రీ సర్వే, డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా చెప్పినట్లు, పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్లలో వచ్చే సమస్యలపై సత్వర, నిర్ణీత సమయంలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగ పూర్తి చేయడం అత్యంత అవసరమని ఆమె సూచించారు.
ఈ సమీక్షలో ముండ్లమూరు తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది, వి ఆర్ ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు మరియు సమస్య పరిష్కారానికి సంబంధిత ఆదేశాలను అందుకున్నారు