శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన

నెల్లిమర్ల నియోజవర్గం , పూసపాటిరేగ మండలం, వెల్దురు పంచాయతీలో బోరపేట గ్రామంలో శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన జనంలో తీసుకెళ్లడం జరిగింది . జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు పార్టీ యొక్క మేనిఫెస్టోను వివరిస్తూ పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది . మరియు శ్రీమతి లోకం మాధవికి ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది . త్రాగునీటి సమస్యలు మరియు డ్రైనేజీ సమస్యలు గురించి ప్రజలు ప్రస్తావిస్తూ ఉండగా ప్రతీ వాడలో ఇదే సమస్య వింటూ ఉన్నాను అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుంది అని మండిపడ్డారు . మరియు జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్య లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ మరింత మెరుగుగా సేవలు అందించేందుకు జనసేన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ఆ గ్రామంలో ఉన్న సమస్యలను శ్రీమతి లోకం మాధవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వీరమహిళ బాసి దుర్గ, గుడివాడ జమరాజు, గుడివాడ శేఖర్, రాజారావు, టి శివాజీ, పి గణేష్,, పితిరు పతిరావు, పి సతీష్, లక్ష్మి నాయుడు, శ్రీరామ్, గణేష్, సన్నీ , కిషోర్, శ్రీను, వినయ్, అప్పలరాజు, వేణు తదితరులు పాల్గొనడం జరిగింది .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.