రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి

• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల్ని ముంచింది
• తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకోవాలి
• రైతులకు ఎకరాకి రూ. 20 వేలు తక్షణ సాయం అందించాలి
• ప్రతి గింజా కొనే విధంగా చర్యలు తీసుకోవాలి
• రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది
• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

మిగ్ జామ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ. 20 వేల చొప్పున తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం
నిర్లక్ష్య వైఖరి వదిలి రైతాంగాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని స్పష్టం చేశారు. ఫసల్ బీమా పథకం చెల్లించని నిర్లక్ష్య వైఖరికి, అసమర్ధతకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కోరారు. ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2 కోట్ల సాయం ఏ విధంగానూ చాలదన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు భరోసా నింపే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని తెలిపారు. మంగళవారం తెనాలిలో తుపాను పరిస్థితులపై ఆయా జిల్లాల నాయకులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించి న మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అతి తీవ్రమైన తుపాను మిగ్ జామ్ బాపట్ల వద్ద తీరం దాటింది. రెండు మూడు గంటల పాటు భూతలం మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు ఏడు జిల్లాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. రైతులకు నష్టం కలిగించే విధంగా, సామాన్యు లకు ఇబ్బంది కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి కే ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం నీరందించలేని
పరిస్థితుల్లో సొంతంగా మోటర్లు పెట్టు కుని రైతులు కష్టపడి పంటలు కాపాడుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడం బాధ కలిగి స్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో నష్టపోయిన రైతాంగానికి మా జనసైనికులు, నాయకులు అండగా నిలిచి సహకారం అందిస్తారు.

• రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకుండా రైతుకి నష్టం కలిగించారు
తెనాలి మండలంలో 15 వేల ఎకరాలు, కొల్లిపర మండలంలో 18 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. తుపాను ప్రకటనలతో రాత్రింబవళ్లు కష్టపడి కొంత మంది కోతలు పూర్తి
చేశారు. అయితే అది పది శాతం కూడా మించలేదు. కోతలు పూర్తయిన 10 శాతంలో ఎంత మంది మిల్లర్లకు అమ్ము కున్నారో కూడా చెప్పలేము. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రధాన
మంత్రి ఫసల్ బీమా పథకానికి రాష్ట్రం వాటా చెల్లించకుండా రైతుల్ని ముంచింది. రైతులకు మేమే కడతామని చెప్పి మరీ అపార నష్టం కలిగించారు. గత రెండే ళ్లు బీమా కింద కేంద్రం
సుమారు రూ. 1100 కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. ఈ ఏడాది రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో బీమా వర్తించదని తేల్చేసింది. రైతులకు ఫసల్ బీమా పథకం వర్తించకుండా చేసిన
అజ్ఞాని మన ముఖ్యమంత్రి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా వర్తించింది. ఇంత నష్టం వాటిల్లినప్పుడు బీమా కట్టకపోతే రైతాంగం ఏమైపోతారు.
• ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి
కరవు మండలాల ప్రకటన వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. ఏడు జిల్లాల్లో 465 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే కరవు
మండలాలుగా ప్రకటించింది. ప్రభుత్వ చర్యలు రైతాంగానికి అపార నష్టం కలిగిస్తున్నా యి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ముఖ్యమంత్రి కచ్చి తంగా బాధ్యత వహించాలి. అధికారులు క్షేత్ర
స్థాయిలో పరిశీలన జరిపి, రైతులకు న్యాయం జరిగే ఏర్పాటు చేయాలి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు శ్రీ బండారు రవికాంత్, శ్రీ ఇస్మాయిల్ బేగ్, శ్రీ హరిదాసు గౌరీశంకర్,
శ్రీ యెర్రు వెంకయ్య నాయుడు, శ్రీ దివ్వె ల మధుబాబు, శ్రీ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.