తిరుపతిలో సామాన్యులు రాజకీయం చేయకూడదా?

* తిరుపతి: పాలక వైకాపా చేసే సామాజిక సాధికారత యాత్రలో న్యాయం లేదని రెడ్డి పాలన కొనసాగుతున్నదని, ఏ డిపార్ట ్మెంట్లో చూసిన రెడ్డి సామాజిక వర్గమే ఏలుతున్నదని మిగిలిన ఎస్సీ , ఎస్టీ, బీసీ , మైనార్టీ లు ఏమయ్యారని జనసేన నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వారు మాట్లాడుతూ.. సాధికారత యాత్ర అంటే అన్ని కులమతాలకు న్యాయం చేసేలా ఉండాలని అన్నారు. కానీ ఇక్కడ ఒకే కలానికి చెందిన వారికే న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అంటే అన్ని కులాలకు సంబంధించి పార్టీ అని కొనియాడారు. త్వరలో రాబోయేది జనసేన, టిడిపి పాలనని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ 1999లో తాను రాయల్ యూత్ అని కొందరితో కలిసి స్థాపించామని, తనను చిన్న వయసు నుంచే కిరణ్ రాయల్గా పిలిచేవారని, నేడు వైసీపీలోని బలిజ కులస్తులు రాయల్ అనే బ్రాండ్ ను వాడుకొని లబ్ధి పొందుతున్నా రని, రాయల్ అన్నది పేరు కాదు బ్రాండ్ అని అది తీసుకొచ్చింది మేమేనని దుయ్య బట్టారు. వైసిపి దుర్మార్గ పరిపాలన నుండి ప్రజలు విముక్తులు కానున్నా రని రానున్నది జనసేన టిడిపి ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు బాబ్జి , మునుస్వా మి, కిషోర్, పార్ధు , వీరామహిళ, రాజేంద్రలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.