ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టాలి : డా.ఘంటసాల వెంకటలక్ష్మి

దెందులూరు, బీసీలు ఇప్పటివరకు చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ లేకుండా పోయింది . దీనికి కారణం బీసీల్లో ఐక్యత లేకపోవడం, పోరాటాలు చేయకపోవడమే బీసీలు వారి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో లేకపోవడం వలనే వారి గొంతుని బలంగా వినిపించలేకపోతున్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చి వాటికి నిధులు ఇవ్వకుండా చేస్తే ప్రశ్నించే బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్ ఒక్కరూ లేరు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని , బీసీలకి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు, అదే విధంగా నామినేటెడ్ పదవులు ఇస్తామని , కులాల వారీగా జనగణన జరిపిస్తామని , మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తామని మేని ఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.