అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం నియోజవర్గం : జనసేన పార్టీ పార్టీ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు ఉభయ గోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ ఆధ్వర్యంలో.. పి.ఎస్.ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ టీం సభ్యులు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులపల్లి సమీపంలో ఉన్న ఉప్పరగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏడు ఇల్లులు ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు గురువారం అన్ని కుటుంబాలని పరామర్శించి, కుటుంబానికి బియ్యం కూరగాయలు వస్త ్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డి నేటర్ చల్లా లక్ష్మీ మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఇల్లు ఇస్తానని వారికి మాట ఇవ్వడం జరిగిందని అక్కడ ప్రజలు చెబుతూ ఉన్నారు. లేనిపక్షంలో ఆమె వాళ్లకి పక్కా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తానని వారందరికీ జనసేన పార్టీ తరఫున మాట ఇవ్వడం జరిగింది. మూర్తి ఏడు కుటుంబాలకి బియ్యం , చీరలు, ఇవ్వడం జరిగింది. పిండి శ్రీను కూరగాయలు ఏడు కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశీ విశ్వ నాథ్, పెంకే జగదీష్, కోలా దుర్గా దేవి, కసిరెడ్డి నాగేశ్వ రావు, పెద్దిరెడ్డి భీమేశ్వరరావు, పబ్బిరెడ్డి ప్రసాద్, తోట సతీష్, ముప్పన రత్నం , నామా శ్రీకాంకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.