వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం

  • 2024లో మరిచిపోలేని యుద్ధం వైసీపీకి ఇద్దాం
  • పొత్తు గెలవాలి- జగన్ పోవాలి అన్నదే మన ఎన్నికల నినాదం
  • పదేళ్ల నుంచి సొంత కష్టంతోనే పార్టీని నడుపుకొచ్చాను
  • జగన్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మద్దతుదా రులు వెనకేసుకొస్తారు
  • నన్ను నమ్మి నాతో నడిచేవారే నా వారు
  • మనలో మనం కలహించుకుంటే శత్రువుతో పోరాడలేం
  • మరోసారి జగన్ వస్తే రాష్ట్రం పూర్తిగా నాశనం
  • తల్లి, చెల్లిని తరిమేసేవాడిని సైకో అనే అంటారు
  • బాబాయ్ ని హత్య చేసినవాడు.. తోడబుట్టిన చెల్లిని గోడకేసి కొట్టినవాడితో యుద్ధం చేస్తున్నాం
  • అయిదుగురు కోసం అయిదు కోట్ల ప్రజల జీవితాలను పణంగా పెట్టే శారు
  • తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం “జెండా” ఉమ్మడి సభలో ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్

సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వరాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి…. జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన- తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ కేతనం “జెండా” భారీ బహిరంగ సభ నిర్వహించారు. శ్రీ ప పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక నుంచి నాయకులకు, | శ్రేణులకు, ప్రజలకి అభివాదం చేసి ఇరు పార్టీల జెండాలను రెపరెపలాడించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “మన పోరాటానికి, విజయానికి స్ఫూర్తి జెండా. 2024 సార్వత్రిక ఎన్నిల్లో ఇరు పార్టీల పొత్తు విజయానికి స్ఫూర్తిగా ఈ సభకు జెండా అని నామకరణం చేశాం. ఎలక్షన్ బూత్ ల్లో వైసీపీ రౌడీలు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడితే డితే ఇం ఇదే జెండా కర్రతో వాళ్లకు బుద్ది బుద్ధి చెప్పొచ్చు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్లు అడ్డాల్లా మెరిసిపోతున్నాయని, చదువులు పూర్తవ్వగానే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, మర్డర్లు, మానభంగాలు సినిమాల్లో తప్ప బయటెక్కడా లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రోడ్లు మీద ప్రయాణించాలంటే రోజుల సమయం పడుతోంది. అందుకే ఆర్థికంగా కొంచెం కష్టమైనా హెలికాఫ్టర్లు తీసుకొచ్చి తిరుగుతున్నాం. ఓజీ పారితోషికంతో రాజకీయ సభలకు వెళ్తున్నా.

• ఆ ఐదుగురూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మాట్లాడితే క్లాస్ వార్ … క్లాస్ వార్ అని మాట్లాడే జగన్… రాష్ట్రాన్ని ఐదుగురికి

తాకట్టు పెట్టాడు. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి… వీళ్లయిదుగురు ప్రాంతాలతో ” సంబంధం లేకుండా పంచాయతీలు చేస్తూ కోట్లు కొల్లగొట్టి మనల్ని తిప్పులు పెడుతున్నారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక నేను, రాజకీయ ఉద్ధండులు శ్రీ చంద్రబాబు గారు ఉన్నాం. మా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను బెదిరించినా… తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలను భయపెట్టాలని చూసినా మక్కెలు విరగొట్టి మడత మంచం మీద పడుకోబెడతాం.

• వామనుడిలా అథఃపాతాళానికి తొక్కుతాం నేను తీసుకునే నిర్ణయాల్లో నా వ్యక్తిగత స్వార్థం ఉండదు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు

అనుగుణంగా ఉంటాయి. ప్రజాకంటకుడి పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికే పొత్తు నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల్లో సహకారం, సంఘర్షణ పక్కపక్కనే ఉంటాయి. 2024 సహకరించాల్సిన సమయం. మనం సహకారం అందించకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుంది. మనలో మనం కలహించుకుంటే ప్రజాకంటకుడు మళ్లీ పీటమెక్కుతాడు. చంద్రబాబు లాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తి. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరు. ఆయన అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా 24 శాసనసభ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే… బలి చక్రవర్తి కూడా వామనుడు మూడు అడుగులు అడిగితే ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి అథః పాతాళానికి తొక్కితే కాని దాని లోతు ఎంతన్నది తెలియలేదు. రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా వైసీపీ వాళ్లకు మనం ఎంతన్నది తెలుస్తుంది. ఇంతింతై వటుడింతయై అన్న చందంగా వైసీపీని అథ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు… నా పార్టీ జనసేన పార్టీ కాదు.

• రాత్రికి రాత్రే రోడ్లు వేశారు

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క శాసనసభ స్థానం గెలిస్తేనే వైసీపీ వణికిపోయింది. రోడ్ల దుస్థితిపై రాజమండ్రి పర్యటనకు వస్తున్నానంటే 10వ తరగతి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిలా రాత్రికి రాత్రే రోడ్లు వేశావు. ఒక్క సీటు గెలిస్తేనే పరిస్థితి అలా ఉందంటే… రేపు 24 సీట్లు గెలిస్తే ఊహించుకోండి. వ్యూహం నాకు వదిలేయండి. జగన్ మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. నేను ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నుటన్నుల సమాచారం ఉంది. జూబ్లిహిల్స్ సొసైటీ పెట్టినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. జగన్ ఇంతవరకు నా మంచితనం మాత్రమే చూశాడు. ఇక ఇప్పుడు యుద్దం చూస్తాడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రిని 53 రోజులు కక్ష కట్టి వైసీపీ నాయకుడు జైల్లో నిర్బందించారు. ఆయన సతీమణిని వైసీపీ నాయకులు అనరాని మాటలు అన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారి సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుల పాలై కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ వైసీపీ నాయకుడు ఆదుకోలేదు. కౌలు రైతుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసిన వ్యక్తి జగన్. నేను వీళ్లకు ఈ రోజు నిలబడకపోతే రేపు మన నాయకులకు, జనసైనికులకు కష్టం వస్తే ఎవరూ రారు. గోబెల్స్ లా ప్రచారం చేసుకుంటున్న జగన్ కు చివరకు గోబల్స్ కు పట్టిన గతే పడుతుంది.

శ్రీ మోడీ అప్పుడే చెప్పారు

జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఎవరైనా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. ఈ ముఖ్యమంత్రి రాజధాని వికేంద్రీకరణ చేశాడు. నేను మరోసారి ఉద్ఘాటిస్తున్నాను… ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని. 2014లో నరేంద్రమోదీ గారే చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రాను స్కాం ఆంధ్రాగా మారుస్తాడని. ఈ రోజు రాష్ట్రాన్ని దోపీడీ ఆంధ్రాగా జగన్ మార్చాడు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేక వలసలు వెళ్లిపోతున్నారు. ఎంతసేపూ సంక్షేమం అందిస్తున్నాం… సంక్షేమం అందిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీ తాత సంపాదించిన ముల్లె నుంచి ప్రజలకు ఇస్తున్నావా… ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి.. మీదేదో ఇచ్చినట్లు బిల్డప్ ఎందుకు? సీపీఎస్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. ఇళ్లపట్టాల పేరుతో ప్రజలను మోసం చేశాడు. ప్రజల వద్దకే పాలన అంటూ భీమ్లా నాయక్ సినిమాకు కలెక్టర్లతో సినిమా టికెట్లు అమ్మించడం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదు. యువత కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. రూ.10 వేలు చేతిలో పెట్టే ముఖ్యమంత్రి కావాలా? లేక మీరు రూ. లక్ష సంపాదించే మార్గం చూపించే ముఖ్యమంత్రి కావాలా? మీరే నిర్ణయించుకోండి. మనం చిన్న ఉద్యోగం చేయాలంటే కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. ముఖ్యమంత్రి, గుండా ఎమ్మెల్యేలకు కాండక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదా? మనల్ని పాలించే వాడు మనకంటే ఉన్నతంగా ఉండాలి. అంతే తప్ప దొంగల్ని, దోపిడీదారులను ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది.

• సలహాలు, సూచనలు కాదు… యుద్ధం చేసేవాళ్లు కావాలి

ముఖ్యమంత్రి జగన్ లా మన దగ్గర లక్షల కోట్ల ఆస్తులు లేవు. తెలుగుదేశం పార్టీలా అనుభవం ఉన్న వ్యవస్థలు లేవు. నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఖర్చు చేసే నాయకులు లేరు. ఇటుక ఇటుక పేర్చి ఇళ్లు కడుతున్నాం. అతి త్వరలోనే కోట కడతాం. సామాన్యుడి రాజకీయం చేస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అధికారం ఎప్పుడు వాళ్ల కోటలోనే ఉండాలనుకుంటున్నారు. మనం వ్యూహాలు వేస్తే భరించలేకపోతున్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం. పొత్తులు పెట్టుకుంటాం… వైసీపీ ఫ్యాక్షన్ కోటలు బద్దలు కొడతాం. నాకు సలహాలు సూచనలు అవసరం లేదు. యుద్ధం చేసే నాయకులు కావాలి. జగన్ దాష్టీకానికి ఎదురొడ్డి నిలబడే యువత కావాలి. నాకు సలహాలు ఇచ్చే వాళ్లకు ఒకటే చెబుతున్నాను. సొంత బాబాయ్ ని హత్య చేసినవాడు.. తోడబుట్టిన చెల్లిని గోడకేసి కొట్టినవాడితో యుద్ధం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తేనే జగన్ లాంటి దుర్మార్గుడు తగ్గుతాడు.

యుద్ధం చేసి కూలగొడితేనే మూల కూర్చుంటాడు. • పోల్ మేనేజ్మెంట్ తెలుసా?

జనసైనికులు సిద్ధంగా ఉన్నా… ప్రజలు మన వైపు ఉన్నా… పోల్ మేనేజ్మెంట్ మనకు తెలుసా? అన్ని బూత్ లకు ఏజెంట్లు ఉన్నారా? అనేది మనమంతా ఆలోచించాలి. ఇదంతా అర్థం చేసుకొనే పొత్తుకు సిద్ధపడ్డాను. ప్రజాస్వామ్యాన్ని నెగ్గించడం కోసం కాస్త తగ్గాను. కొంతమంది మద్దతుదారులు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ వాళ్ల బాబాయ్ ను మర్డర్ చేసినా… లక్షల కోట్లు దోచుకున్నా… దళితుడిని చంపి డోర్ డెలవరీ చేసినా వాళ్ల మద్దతుదారులు ఆయన్ను వెనకేసుకొస్తారు. నేను పదేళ్లలో ఎలాంటి అవినీతి చేయకపోయినా… ఇప్పటి వరకు పదవులు అనుభవించకపోయినా.. కష్టపడి సంపాదించిన సొమ్ము పార్టీ కోసం ఖర్చు చేసినా నన్ను ప్రశ్నిస్తారు. మీరు నిజంగా నా వాళ్లు అయితే నాతో నడుస్తారు. నన్ను శంకించేవాడు నా వాడు ఎప్పటికీ కాడు.

• తల్లి, చెల్లిని తరిమేసినవాడిని సైకో అనకపోతే ఏమంటారు..?

పవన్ కళ్యాణ్ తో స్నేహమంటే చచ్చే వరకు… పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతలి వాడు పోయే వరకు…. జగన్ ఇద్దరు కలిస్తే చూడలేడు. నలుగురు నవ్వుకుంటే ఓర్వలేడు. పదిమంది పచ్చగా ఉంటే భరించలేడు. బాబాయ్ ను చంపి, సొంత తల్లి, చెల్లిని తరిమేసినవాడిని ఏమంటారు… దాష్టికుడు, సైకో అంటారు. జగన్ కు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు అని మాట్లాడతాడు. నాలుగు పెళ్లిళ్లు అని కూడా అంటాడు. నాకు నాలుగో పెళ్లి ఎప్పుడు జరిగిందో నాకే తెలియదు. ఒక వేళ నాలుగో పెళ్లాం జగన్ అయి ఉండొచ్చు. అందుకే నాలుగో పెళ్లాం అంటూ మాట్లాడతాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అంటే .ఎగిరే జాతీయ జెండా, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, కన్నీళ్లు తుడిచే చేయి, పెద్దోళ్ల భుజంపై కండువా, ప్రాణాలు కాపాడే 108, ఆడబిడ్డలకు అండగా ఉండే రాఖీ… నిన్ను పాతాళానికి తొక్కే వామనుడు. తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాను. వైసీపీ విధ్వంస పాలనకు చరమ గీతం పాడుతాం. శాంతి, సుస్థిరత ఏర్పాటు చేస్తాం. పొత్తు గెలవాలి జగన్ పోవాలి. వైసీపీ నేలమట్టం అవ్వాలి” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.