తడిసిన, మొలకెత్తిన ధాన్యము తక్షణమే కొనుగోలు చేయాలి: రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం : మలికిపురం మండలం, మట్టపర్రు గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను కలిసి పరామర్శించిన జనసేన శ్రేణులు, జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు. ఆయన మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని తక్షణము కొనుగోలు చేయాలి, ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.