ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావు లేకుండా చూడాలి

  • అర్హత లేని సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి
  • కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు జనసేన విజ్ఞాపన
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2024లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకి తావు లేకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన కోరింది. ఓటర్ల జాబితాలో అనేక దోషాలు బయటపడుతున్నాయని, వాటిని సవరిం చాలని స్పష్టం చేసిం ది. విజయవాడలో సమీక్ష సమావేశాలు చేపట్టి న కేం ద్ర ఎన్ని కల సంఘం అధికారులను జనసేన ప్రతినిధులు కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలకు సంబంధిం చిన అంశాలను తెలిపారు. కేం ద్ర ఎన్ని కల సంఘం అధికారులను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్ శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెం కట మహేష్, గుం టూరు జిల్లా అధ్య క్షుడు శ్రీ గాదె వెం కటేశ్వర రా వు ఉన్నా రు. జీరో డోర్ నెం బర్ ఇళ్లు లక్షల్లో ఉన్నా యనీ ఆ పేరుతో భారీ గా ఓట్లు నమోదు చేశారని.. వీటిపై విచారణ చేపట్టాలన్నా రు. అదే విధంగా ఒకే డోర్ నెం బర్ మీద పదుల సంఖ్య లో ఓటర్లు ఉన్నా రన్నా రు. గ్రామ, వార్దు సచివాలయాల ఉద్యో గులకి ఎన్ని కల విధుల్లో పాల్గొనే అర్హత లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువె ళ్లారు. వాలంటీర్లను దూరం పెట్టాలన్నా రు. ఈ మేరకు అధికారులకి విజ్ ఞాపన పత్రం అందిం చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.